తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారంతా పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు బోధించడానికి రానున్నారు. దానికోసం టాలీవుడ్కు చెందిన వారందరూ ఒక చోటకు చేరి సందడి చేశారు. టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని పలు సబ్జెక్ట్స్ ఔత్సాహికులతో బోధించేలా కృషి చేస్తోంది. దీనిలో సినీనటీనటులు కూడా మద్దతు తెలుపుతూ అప్పుడప్పుడు వచ్చి బోధన చేసి వెళ్తుంటారు. పిల్లలకు మంచి విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది.
అందులో భాగంగా రకుల్ ప్రీత్సింగ్, నవదీప్, అల్లు శిరీశ్ తదితరులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పారు. చాలామంది ఇప్పుడు ఒకచోటకు వచ్చి సందడి చేశారు. అందులో భాగంగా ఓ మంచి పనికోసం ఒకచోటకు చేరి సందడి చేశారు. సరైన సదుపాయాలు లేక చదువుకు దూరమైపోతున్న చిన్నపిల్లలకు సాయం చేయడం కోసం కుర్ర నటీనటులంతా ఓ కార్యక్రమం చేశారు.
టీచ్ ఫర్ ఛేంజ్ స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరించేందుకు నటీనటులు మంచు లక్ష్మి, నిఖిల్, అల్లు శిరీశ్, నవదీప్, సుశాంత్, అడవి శేశ్, ఆదర్శ్, రకుల్ ప్రీత్ సింగ్, ఈశా రెబ్బా, తేజస్వి మాదివాడ, సీరత్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. ర్యాంప్పై ఫ్యాషన్ షోతో అందాలు ప్రదర్శించి నిధులు సేకరించారు. ఈ కార్యక్రమానికి హీరోలంతా నలుపు దుస్తుల్లో స్టయిలిష్ లుక్స్తో కనిపించగా హీరోయిన్లు సంప్రదాయ దుస్తుల్లో అచ్చ తెలుగు ఆడపిల్లల్లా కనిపించారు.