Friday, May 17, 2024
- Advertisement -

జ‌గ‌న్ మీద క‌త్తిదాడిపై మోహ‌న్ బాబు ఎమోష‌న‌ల్ స్పంద‌న‌

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విశాఖ ఏయిర్‌పోర్టులో జ‌రిగిన దాడిని ఇప్ప‌టికే వివిధ‌ రాజ‌కీయ ప్ర‌ముఖులు స్పందించారు. ఇది అమానుష చ‌ర్య‌ల‌ని ఖండించారు. తాజాగా సినీనటుడు,నిర్మాత మంచు మోహన్ బాబు స్పందించారు. జగన్ పై దాడి దుర్మార్గపు చర్య అంటూ అభిప్రాయపడ్డారు.

తాను రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తినని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అయితే ఒక సినీ నిర్మాతగా, నటుడిగా బాధ్యతగల పౌరుడిగా ఇలాంటి ఘటనలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు మడికట్టుకుని ఇంట్లో కూర్చోలేనని తెలిపారు.

జ‌గ‌న్‌పై దాడి పిరిక‌పంద చ‌ర్యగా అభివ‌ర్ణించారు. షెక్కూరిటీ అనుమ‌తి లేకుండా పెన్న‌కూడా లోప‌లికి పోనీయ‌ని షెక్యూరిటీ క‌త్తినితీసుకెల్ల‌డం ఆలోచించాల్సిన విష‌యం అన్నారు.నిందితుడిని హత్య చెయ్యాలని ఎవరైనా ప్రోత్సహించారా అనే కోణంలో విచారించాలని ఆయన గురువారం డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక అస‌లైన నిజాలు నిగ్గుతేలాల్సిఉంద‌న్నారు మోహ‌న్ బాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -