Thursday, April 18, 2024
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూత!

- Advertisement -

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు నటులు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కరోనాతో కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి శనివారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. శ్రీధర్ జన్మస్థలం నెల్లూరు.. సినిమాలపై మక్కువతో ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

తర్వాత తానే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతగా మారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు, జయసుధతో ‘సోగ్గాడి కాపురం’…. వై. నాగేశ్వరావు దర్శకత్వంలో సుమన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ సినిమాలు నిర్మించారు.

ఇండస్ట్రీలో సౌమ్యులు, సహృదయులైన శ్రీధర్ రెడ్డి లేని లోటు తీరనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు తెలుగు చిత్ర ప్రముఖులు.

అమెరికాలో కాల్పుల మోత.. 12 మంది మృతి

నేటి పంచాంగం, సోమవారం (10-05-2021)

సంపూ ‘క్యాలీఫ్ల‌వ‌ర్’ టీజర్ రిలీజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -