Wednesday, May 1, 2024
- Advertisement -

సామాజిక కార్య‌క్ర‌మాల్లో త్రిష… మ‌రుగుదొడ్డి నిర్మించిన అమ్మ‌డు

- Advertisement -

సినిమాల‌తో న‌టించి మెప్పించిన తార‌లు ఇప్పుడు సినిమాలను ప‌క్క‌న పెట్టి సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. సినిమాల్లో చురుగ్గా రాణించి సినిమా అవ‌కాశాలు లేని స‌మ‌యంలో సామాజిక కార్య‌క్రమాల్లో బిజీ అవుతున్నారు. ఆ విధంగా త‌మ జీవితాన్ని డిజైన్ చేస్కుంటూ పోతున్నారు.

త్రిష తెలుగు, త‌మిళ సినిమాల్లో విరివిగా చేసేసి ఇప్పుడు ప్ర‌స్తుతం సినిమాల‌కు కొంచెం దూర‌మైంది. దాదాపు ప‌దిహేనేళ్లు సినిమా ప‌రిశ్ర‌మ‌లో రాణించారు. ఇప్పుడు కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. మనసున్న మంచి నటిగా ప్ర‌స్తుతం త్రిష గుర్తింపు తెచ్చుకుంటోంది. త్రిష యూనిసెఫ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే ఆ సంస్థతో క‌లిసి త్రిష పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇటీవల చెన్నై లోని కాంచీపురం జిల్లా నెమ్మెలి గ్రామంలో పారిశుద్ధ్యంపై అవగాహన కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మ‌రుగుదొడ్డి నిర్మించుకోవాల‌ని చెబుతూ స్వ‌యంగా మ‌రుగుదొడ్డి నిర్మాణం చేసింది.

మ‌రుగుదొడ్డి నిర్మాణంలో త్రిష ఇటుకలు పేర్చి సిమెంట్ కూడా వేసింది. చివ‌రికి మ‌రుగుదొడ్డి పూర్త‌య్యే వ‌ర‌కు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -