కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి వెండితెర, బుల్లితెరపై ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు వివిధ అనారోగ్య కారణాలతో మృతిచెందారు. కేవలం తెలుగు పరిశ్రమలోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మళయాలం ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వివిధ అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా కోలీవుడ్లో బుల్లితెర నటుడు కుట్టి రమేష్ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. పలు టివి సీరియల్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ టివిలో తేన్మోవి, బిఎం వంటి సీరియల్స్లోన నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
రమేష్ మృతి బుల్లితెరకు తీరని లోటు అని పలువురు సెలబ్రెటీలు విచారం వ్యక్తం చేశారు. రమేష్ మృతిపట్ల విజయ టివి యాజమాన్యం, తోటి నటులు సంతాపం తెలిపారు.
నేను ప్రజలకు సేవ చెయ్యడం ఒక కల.. ఆర్జీవీ!
టాలీవుడ్ లో మరో విషాదం.. తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి తండ్రి మృతి