జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. కొన్ని మీడియా ఛానళ్లపై వరుస విమర్శలు.. ఆరోపణలు చేస్తున్న ఆయన తాజాగా మరోసారి ఆసక్తికర ట్వీట్లు చేయటం సంచలనంగా మారింది.పవన్ ఇప్పటికే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి,టీవీ 9 పలు విమర్శలు చేశారు.వీళ్లు తమ తల్లి గురించి మాట్లాడింది పదే పదే చూపించి తమను అగౌరపరిచారని పవన్ ప్రధాన విమర్శ. నిన్న ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసన తెలిపిన పవన్ తరువాత వరుస ట్వీట్లతో రెచ్చిపొతున్నాడు. ‘నా తల్లిపై అసభ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు ఎంపీ సుజనా చౌదరి లేదా ఆయన బినామీ నుంచి నిధులు పొందుతున్న మహాన్యూస్ టీవీ పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుంది.
మహాటీవీ కూడా..’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు… నిజమైన “అజ్ఞ్యాతవాసి” మీకెవరో తెలుసా? అంటూ ట్వీట్ చేసిన పవన్ ఇప్పుడు ఆ అజ్ఞాతవాసి ఎవరో చేప్పేశాడు పవన్.అతను ఎవరో కాదు టీవీ9 రవి ప్రకాశ్.తనను తక్కువ చేసి చూపిస్తున్నారని దాని కోసం 10 కోట్లు కూడా చేతులు మారినట్లు పవన్ చెప్పుకొచ్చాడు.సమాజంలో తన స్థాయిని తక్కువ చేయడానికి ఓ మీడియా గ్రూప్ కసిగా పని చేస్తుందని వాళ్ల అందరిని లీగల్గా ఎదుర్కొంటానని ఎవరిని వదిలి పెట్టను పవన్ తన ట్వీట్టర్ ద్వారా తెలియజేశాడు. మరి పవన్ చేసిన ఆరోపణలను టీవీ 9 రవిప్రకాష్ ఏవిధాంగా స్పందిస్తాడో చూడాలి.ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పరువు నష్టం దావా వేయాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
SriniRaju ..your legal letter doesn’t make any difference after you got my Mother abused repeatedly with the guidance of #Real AgnyathavasiRaviPrakash” your CEO on your channelTV9 colluding with your political bosses who blessed you with SriCity. GoodLuck Srini!
— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018