- ప్లాన్ చేస్తున్న హరీశ్శంకర్
సింగిల్ హీరోతో సినిమాలు సోసోగా ఆడుతున్నాయి. అదే మల్టీస్టారర్ అయితే సినిమా విడుదలకు ముందే భారీ రేట్లకు వివిధ హక్కులు అమ్ముకోవచ్చు. చివరకు థియేటర్లోకి వచ్చేవరకు హంగామా కొనసాగుతుంది. ఇక సినిమా విడుదల అయిన తర్వాత ఏం జరిగినా సంబంధం ఉండదు. హిట్టయితే దానికి మించిన ఆనందం ఉండదు. ఈ విధంగా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలతో మల్టీస్టారర్ సినిమాలపై చాలామంది ఫోకస్ పెడుతున్నారు. ఆ విధంగా వచ్చి క్లాసిక్ హిట్గా నిలిచిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, మసాలా, నక్షత్రం తదితర సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు బాగానే ఆడాయి. ఆ సినిమాలు చేస్తే నటీనటులకు పని దొరుకుతుంది. దర్శకుడికి పేరు వస్తది. అలాంటి కోవలోనే హరీశ్శంకర్ మల్టీస్టారర్ సినిమా తీయాలని ప్లాన్ వేస్తున్నాడు.
కథ ముందే సిద్ధం చేసుకున్నాడు. సినిమాలో ఎవరెవర్ని తీసుకుందామని వెతుకులాట చేశారు. చివరికి వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ నటులతో సినిమాల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు యువ నటులు ఎవరో కాదు నితిన్, శర్వానంద్. శర్వానంద్ కూడా ఎక్స్ప్రెస్ రాజాలా దూసుకెళ్తున్నాడు. శతమానం భవతి, మహానుభావుడు హిట్లతో ఊపు మీద ఉన్నాడు. నితిన్ సినిమాలు లై నిరాశపరిచినా అందరికీ నచ్చింది. అతడి గత చిత్రాలు బాగా ఆడాయి. దీంతో ఈ ఇద్దరు సక్సెస్ ఫుల్ హీరోలతో హరీశ్శంకర్ సినిమా తీస్తున్నాడని సమాచారం. కథ విని వారిద్దరూ ఓకే చెప్పారని టాక్. వారిద్దరూ ఒకే అనడంతో హరీశ్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడు. కామెడీ అండ్ యాక్షన్ నేపథ్యంలో కథ ఉండనుంది. అయితే ఎప్పడు ప్రారంభిస్తాడో ఇంకా సమాచారం లేదు.