Tuesday, April 23, 2024
- Advertisement -

మ‌ర్దిల‌కు చెర్రీ దంప‌తుల ప్ర‌శంస‌లు

- Advertisement -

ఇప్పుడు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మెగా న‌టుల మ‌ధ్య వార్ న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. సాయి ధరమ్‌తేజ్ – వరుణ్‌తేజ్ సినిమాలు రోజు విడిచి థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌డంతో వీరి సినిమాల‌పై కొంచెం వార్‌లాంటిది కొన‌సాగుతోంది. ఏ సినిమా హిట్ట‌వుతుంది? ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటుందా అని అందరిలో చ‌ర్చానీయాంశమైంది. ఇంటిలిజెంట్ ఫిబ్రవరి 9వ తేదీన విడుద‌ల చేస్తుండ‌గా తొలిప్రేమ త‌ర్వాతి రోజు 10వ తేదీన విడుద‌ల కానున్నాయి. ఈ విధంగా విడుద‌ల అవ్వ‌డానికి కొంద‌రు పెద్ద‌లు తెర వెనుక ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే మెగా కుటుంబ‌స‌భ్యులు ఏ సినిమాపై స్పందిస్తే ఏమ‌వుతుందోన‌ని క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నారు.

అయితే మెగా దంపతులు రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న మాత్రం భిన్న‌మైన శైలిలో స్పందించారు. ఆ రెండు సినిమాలపై వీరిద్ద‌రు స్పందించారు. అయితే ఇద్దరు ఒక్కో సినిమాపై ఒక్కో తీరుగా స్పందించారు.

వరుణ్‌తేజ్ తొలి ప్రేమకు ఉపాసన మ‌ద్దతు ప‌లికి ఈ సినిమా అంద‌రూ చూడాల‌ని, వ‌రుణ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పేసింది. తొలిప్రేమ ట్రైలర్ పై ఉపాసన స్పందిస్తూ.. వరుణ్ తేజ్ ఈజ్ సో స్వీట్.. చూస్తుంటే సినిమాను ప్రతి గర్ల్ డిఫెరెంట్ గా ఎంజాయ్ చేస్తుందేమో అని అనిపిస్తోంది.

ఇక రామ్‌చ‌ర‌ణ్ త‌న బామ్మ‌ర్ది సాయిధ‌ర‌మ్‌తేజ్‌ ఇంటిలిజెంట్ సినిమాపై స్పందించాడు. గుడ్‌లాక్ అని ఫేస్‌బుక్‌లో ట్రైల‌ర్‌పై స్పందించాడు. “ప్రతి ఫ్రేమ్‌లో వివి.వినాయక్ మ్యాజిక్ చూడవచ్చు.. తప్పకుండా సాయి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అని రామ్‌చరణ్ తేజ్ తెలిపాడు.

ఈ విధంగా ఇద్ద‌రు హీరోల‌కు భార్యాభ‌ర్త‌లు మ‌ద్ద‌తు ప‌లికి ఇద్ద‌రికీ త‌మ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -