Thursday, April 25, 2024
- Advertisement -

ఉప్పెన మూడు రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందంటే…!

- Advertisement -

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎన్నో అంచనాలతో నటించిన సినిమా “ఉప్పెన”.  సుకుమార్  శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

ఉప్పెన’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు ఈ చిత్రానికి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. దాంతో సంబంధం లేకుండా 10.42 కోట్ల షేర్ నమోదు చేసింది.డెబ్యూ హీరోల్లో వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

ముడు రోజుల్లో వైష్ణవ్ తేజ్ ఉప్పెన వరల్డ్ వైడ్ గా 28.29కోట్ల షేర్స్ ను అందించడం విశేషం. సినిమాకు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఆదివారం కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. చూస్తుంటే సుకుమార్ చెప్పినట్లుగా సినిమా 100కోట్ల సినిమా అయ్యేలా ఉందని సమాచారం అందుతుంది.

మోనాల్, అఖిల్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ మొద‌లైంది !

ఎమ్మెల్యే జోగి రమేష్‌ పిటిషన్ వాయిదా.. ఏమవుతుందో..!

వైఎస్​ షర్మిల కసరత్తులు.. ఈరోజు వారితో భేటీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -