ఆధార్కార్డులు మీ పేరు మీద మీతో కాకుండా వేరే వాళ్ల చేతుల్లోనే ఉండొచ్చు. ఆ విధంగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. ఆధార్ కార్డుకు భద్రతా లేకుండా పోవడంతో ఎవరి పేరు మీదైనా వాళ్లకు సంబంధం లేకుండా బయటకొస్తున్నాయి. ఇది సాధారణ ప్రజలకు సర్వసాధారణం. అయితే ఇదే పరిస్థితి ఓ హీరోయిన్కు ఎదురైంది. ఆమె ఆధార్ కార్డును వేరే వాళ్లు తీసుకొని యథేచ్చగా వినియోగిస్తున్న విషయం షాకింగ్కు గురయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తనకు సంబంధించిన ఆధార్ కార్డును వినియోగిస్తున్నారని.. ఎవరో మోసం చేయడానికి ప్రయత్నించారంటూ.. ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. హేట్ స్టోరీ 4 సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. అయితే ఇటీవల ముంబై బాంద్రాలోని ఓ స్టార్ హోటల్కు వెళ్లింది..
ఆ హోటల్లో రూమ్ కావాలంటూ రిసెప్షన్ సంప్రదించగా.. అప్పటికే ఊర్వశీ పేరుపై రూమ్ బుక్కయ్యిందని హోటల్ సిబ్బంది చెప్పారు. తన అసిస్టెంట్స్ చేశారేమోనని వారిని అడగ్గా తాము ఎలాంటి బుకింగ్స్ చేయలేదని సమాధానం ఇచ్చారు. దీంతో మరోసారి రూమ్ బుకింగ్ గురించి సిబ్బందిని వాకబు చేసింది. ఊర్వశీ ఆధార్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో హోటల్ రూమ్ బుకింగ్ చేసినట్లు సిబ్బంది సమాధానం చెప్పడంతో ఊర్వశీ షాక్కు గురయ్యింది. దీనిపై ఆమె నిశితంగా పరిశీలించింది. చివరికి అది నకిలీ ఆధార్ కార్డ్ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది
ఆధార్ నెంబర్ తనది కాదని.. తన ఫోటో-పేరు ఉపయోగించి నకిలీ కార్డు తయారు చేసి హోటల్ రూమ్ బుక్ చేశారని ఊర్వశి రౌతలా బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.