Friday, April 19, 2024
- Advertisement -

వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్.. విడుదల ఎప్పుడంటే..!

- Advertisement -

తన తొలి సినిమాతోనే టాలీవుడ్ లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. ఒక్క సినిమాతోనే వైష్ణవ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. తొలి సినిమాతోనే రూ. వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కాగా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా చేస్తున్న సమయంలోనే స్టార్ డైరెక్టర్ క్రిష్ తో మరొక సినిమాను ప్రారంభించాడు.

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే పూర్తయింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో నిలిచిపోయాయి. తాజాగా ఆ పనులు కూడా మొదలయ్యాయి. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ అతి త్వరలో మొదలు పెట్టనున్నారు మేకర్స్.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించాడు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో పాటు తమిళ డైరెక్టర్ గిరిశయ్యతో కలసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

Also Read : ఆర్ఆర్ఆర్ కు పోటీగా అఖండ.. రిస్క్ వద్దంటున్న అభిమానులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -