వకీల్ సాబ్ హిట్ తో మాంచి ఊపు మీద ఉన్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అంతకుముందు ఈ దర్శకుడు చిన్న సినిమాలే తీశాడు. ఓ మైఫ్రెండ్, ఎంసీఏ వంటి సినిమాలు తీశాడు. భారీ హిట్లు కొట్టకపోయినా.. ఓ మోస్తరు పేరొచ్చింది. అయితే ఈ దర్శకుడికి పవన్ కల్యాణ్ అవకాశం ఇచ్చాడు. పింక్ రీమేక్ అయినప్పటికీ.. వకీల్సాబ్ను తనదైన స్టయిల్లో పవన్ ఫ్యాన్స్కు నచ్చేలా తెరకెక్కించాడు వేణు శ్రీరామ్.
సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక వేణుకు ఫుల్ ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ అదేం జరగలేదు. వేణుకు స్టార్ హీరోలనుంచి పెద్దగా ఆఫర్లు దొరకలేదు. దీంతో నానితోనే మళ్లీ ఓ మూవీ తీయాలని వేణు ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకు కారణం ఏమిటంటే..! వేణు తీసిన వకీల్ సాబ్ హిట్ అయ్యింది. కానీ ఇప్పుడు స్టార్ హీరోల లైనప్ భారీగా ఉంది. ఒక్కో హీరో కోసం ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లు చూస్తున్నారు. మరోవైపు పెద్ద హీరోల పిలుపు కోసం వెయిట్ చేస్తే.. భవిష్యత్ నాశనం అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందుగా ఏదో ప్రాజెక్ట్లో బిజీ అయిపోవాలని వేణు భావించినట్లు తెలుస్తోంది.
Also Read: మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!
ఈ క్రమంలోనే నానీతో ఓ మూవీకి ఓకే చెప్పాడు. అయితే గతంలో నానీతో కలిసి వేణు శ్రీరామ్ ఎంసీఏ మూవీ తీశాడు. ఈ మూవీ మంచి కలెక్షన్లే రాబట్టింది. దీంతో నానికి మరో కమర్షియల్ కథ చెప్పాడట వేణు. అందుకు నానీ కూడా ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలు ఎక్క బోతున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీకి నిర్మాత ఎవరు? షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న విషయంపై క్లారిటీ లేదు.
Also Read: ఈ సారి పవన్ నుంచి ఫన్ ఒక్కటే కాదు.. మెసేజ్ కూడా..!