Thursday, April 25, 2024
- Advertisement -

వేణు శ్రీరామ్ తర్వాతి ప్రాజెక్ట్​ ఇదే?

- Advertisement -

వకీల్ సాబ్​ హిట్​ తో మాంచి ఊపు మీద ఉన్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అంతకుముందు ఈ దర్శకుడు చిన్న సినిమాలే తీశాడు. ఓ మైఫ్రెండ్​, ఎంసీఏ వంటి సినిమాలు తీశాడు. భారీ హిట్లు కొట్టకపోయినా.. ఓ మోస్తరు పేరొచ్చింది. అయితే ఈ దర్శకుడికి పవన్​ కల్యాణ్​ అవకాశం ఇచ్చాడు. పింక్​ రీమేక్​ అయినప్పటికీ.. వకీల్​సాబ్​ను తనదైన స్టయిల్​లో పవన్​ ఫ్యాన్స్​కు నచ్చేలా తెరకెక్కించాడు వేణు శ్రీరామ్.

సినిమా సూపర్​ హిట్​ కావడంతో ఇక వేణుకు ఫుల్ ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ అదేం జరగలేదు. వేణుకు స్టార్ హీరోలనుంచి పెద్దగా ఆఫర్లు దొరకలేదు. దీంతో నానితోనే మళ్లీ ఓ మూవీ తీయాలని వేణు ఫిక్స్​ అయినట్లు సమాచారం. అందుకు కారణం ఏమిటంటే..! వేణు తీసిన వకీల్​ సాబ్​ హిట్​ అయ్యింది. కానీ ఇప్పుడు స్టార్ హీరోల లైనప్ భారీగా ఉంది. ఒక్కో హీరో కోసం ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లు చూస్తున్నారు. మరోవైపు పెద్ద హీరోల పిలుపు కోసం వెయిట్​ చేస్తే.. భవిష్యత్​ నాశనం అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందుగా ఏదో ప్రాజెక్ట్​లో బిజీ అయిపోవాలని వేణు భావించినట్లు తెలుస్తోంది.

Also Read: మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!

ఈ క్రమంలోనే నానీతో ఓ మూవీకి ఓకే చెప్పాడు. అయితే గతంలో నానీతో కలిసి వేణు శ్రీరామ్​ ఎంసీఏ మూవీ తీశాడు. ఈ మూవీ మంచి కలెక్షన్లే రాబట్టింది. దీంతో నానికి మరో కమర్షియల్​ కథ చెప్పాడట వేణు. అందుకు నానీ కూడా ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్​ త్వరలోనే పట్టాలు ఎక్క బోతున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీకి నిర్మాత ఎవరు? షూటింగ్​ ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న విషయంపై క్లారిటీ లేదు.

Also Read: ఈ సారి పవన్ నుంచి ఫన్ ఒక్కటే కాదు.. మెసేజ్ కూడా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -