Friday, April 26, 2024
- Advertisement -

ఈ సారి పవన్ నుంచి ఫన్ ఒక్కటే కాదు.. మెసేజ్ కూడా..!

- Advertisement -

పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పవన్ -హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత బంపర్ హిట్టో అందరికీ తెలిసిన విషయమే. పదేళ్ల వరుస ఫ్లాపుల తర్వాత పవన్ కి హరీష్ శంకర్ హిట్ ఇచ్చాడు. దీంతో పవన్ అభిమానుల గుండెల్లో హరీష్ శంకర్ స్థానం సంపాదించాడు.

వీరిద్దరి కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వీరి ఆశలు ఫలించి తొందర్లోనే వీరిద్దరి కాంబినేషన్లో మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ లో హరీష్ శంకర్ పవన్ తో కామెడీ చేయించడంతోపాటు మంచి యాక్షన్ సీన్స్ చేయించాడు. అలాగే పవన్ ని స్టైలిష్ గా చూపించాడు. అలాగే ఆయన మేనరిజమ్స్ కూడా ప్రత్యేకంగా చూపించాడు.

Also Read: విజయ్​ సేతుపతి వదులుకున్న పాత్రకు చైతూకి.. వర్కవుట్​ అవుతుందా?

అయితే త్వరలో తమ కాంబినేషన్లో రానున్న సినిమాలో పవన్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంత స్టైలిష్ గా చూపిస్తానని పలు ఇంటర్వ్యూలలో హరీష్ శంకర్ తెలిపాడు. అయితే ఈ సినిమాలో సోషల్ మెసేజ్ కూడా హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన నుంచి మంచి సందేశాన్ని వినిపించాలని హరీష్ భావిస్తున్నాడట. ఈ సినిమాలో ఇది హైలెట్ కానుండగా, మరో హైలైట్ ఏమిటంటే పవన్ కెరీర్లోనే తొలిసారిగా డబుల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: హీరో చేంజ్.. మహేష్ కథలోకి పవన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -