Friday, May 17, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి రీమేక్ ఆఫర్ ?

- Advertisement -

టెంపర్ తరువాత రెట్టించిన ఉత్సాహంతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతాగ్యారేజ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అవ్వగానే వక్కంతం వంశీ, పూరీజగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి దర్శకులు క్యూలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో పాటు మరో దర్శకుడు కూడా ఈ క్యూలో నిలుచుని ఎన్టీఆర్ కోసం అద్బుతమైన కథని తెచ్చానని చెబుతున్నాడు.

ఆ దర్శకుడు ఎవరో తెలుసా…ఎన్టీఆర్ కి బృందావనంతో క్లాస్ ఇమేజ్ వచ్చేలా చేసిన వంశీ పైడిపల్లి. ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తుల్లో ఒకడైన వంశీతో ఇదివరకే ఊపిరి లో చేయాల్సి ఉన్నా కొన్ని కారాణాల వల్ల చేయని ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఓ సూపర్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేద్దామని ప్లాన్ వేస్తున్నాడట.

ఆ సినిమా 2012 లో హృతిక్ రోషన్-సంజయ్ దత్ ల కాంబినేషన్ లో వచ్చిన అగ్నీపత్ సినిమా అని అంటున్నారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని కొందరు హీరోలు అనుకున్నా ఎందుకనో ఆచరణలో పెట్టలేదు. కాగా ఇప్పుడు ఆ స్టోరీని ఎన్టీఆర్ కి సెట్ చేయాలని వంశీ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఇది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -