బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.ఈ భామను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువే.ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ను పోస్ట్ చేస్తుంటుంది వాణీ కపూర్.తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఫిట్నెస్ అంటే ప్రాణం కావడంతో రెగ్యులర్ గా జిమ్ముకెళ్ళి కసరత్తులు చేస్తూ కనీసం ఒక మిల్లి గ్రాము ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా బాడీలో చేరకుండా జాగ్రత్త పడుతుంది.ఎక్సర్ సైజులు చేస్తున్న తన హాట్ అవతారాన్ని ఇన్స్టాగ్రామ్లో మంగళవారం షేర్ చేసింది.
ఆ ఫోటోలకు బుధవారం కల్లా లక్షా యాభై వేల లైకులొచ్చాయి. అంటే కుర్రాళ్ళ హృదయ వీణను వాణి సుతిమెత్తగా మీటిందనేగా దీని అర్థం.వాణీ కపూర్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించే ఒక క్రేజీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కిందట. ఈ సినిమాలో హీరోలుగా హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్లు నటిస్తున్నారు.వాణి కపూర్ తెలుగులో కూడా నటించింది.నాని నటించిన ‘ఆహ కళ్యాణం సినిమాలో హీరోయిన్గా నటించింది వాణీ కపూర్.