తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనదైన ప్రత్యేక నటనతో అందరినీ అలరిస్తుంది వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్ గా కెరీర్ ఆరంభించి లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి అక్కడ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. తమిళనాట వరలక్ష్మి శరత్ కుమార్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే వరలక్ష్మి శరత్ కుమార్ కే పెద్ద పీట వేస్తున్నారు. ఓవైపు తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఛాన్సులు దక్కించుకుంటుంది.
తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ .. ‘నాంది’ సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ‘క్రాక్’ సినిమాలో విలన్ గా ఆమె ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా కోసం కూడా ఆమెను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
అలాగే ‘హనుమాన్’ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటిస్తున్నారు. మొత్తానికి వరలక్ష్మీ శరత్ కుమార్ వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది.
విశాఖలో పీవీ సింధు అకాడమీకి 2 ఎకరాల భూమి.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
వీడు మనిషా.. రాక్షసుడా..? తల్లిని చంపి తర్వాత..
300 ఎన్ కౌంటర్లు చేసిన మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మ అరెస్ట్!