ఈ మద్య మనిషి ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. కొన్ని మానసిక కారణాల వల్ల పైశాచికంగా మారి ఎదుటి వ్యక్తులను దారుణంగా చంపడం.. హింసించడం చేస్తున్నారు. కొంత మంది సైకోలుగా మారి ఎన్నో అకృత్యాలకు పాల్పపడుతున్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో మతిస్థిమితం లేని వ్యక్తి తన తల్లిని చంపి ఆమెను తినడం కలకలం రేపింది. 2019 జనవరిలో అల్బెర్టో సాంచెజ్ గోమెజ్ (28) తన తల్లిని దారుణంగా చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఆపై 15 రోజుల పాటు తిన్నాడు.
ఇతడు తన తల్లిని చంపి ఆ తర్వాత మృత దేహంతో చేసిన పనులు చూసి పోలీసులు హడలి పోయారు. ఈ కేసులో సాంచెజ్ ను అదే ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేయగా ఏప్రిల్ లో విచారణ మొదలైంది. నిందితుడికి న్యాయస్థానం తల్లిని హత్య చేసినందుకు 15 ఏండ్లు, మృతదేహాన్ని అపవిత్రం చేసినందుకు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు సోదరుడికి పరిహారం కింద 73,000 డాలర్లు చెల్లించాలని కోర్టు సాంచెజ్ ను ఆదేశించింది.
ఒక చిన్న విషయంలో తల్లీకొడుకు మద్య వాగ్వాదం పెరిగి తల్లిని హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆపై ఆమె శరీరాన్ని కత్తులు, కార్పెంటర్ వాడే రంపంతో కోసి వాటిలో కొన్ని ముక్కలను ఫ్రీజర్ లో, మరికొన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కాడు. ఇలాంటి క్రిమినల్స్ విషయంలో ఎలాంటి కనికరం ఉండబోదని.. ఈ కేసులో నిందితుడికి 15 ఏండ్ల 5 నెలల జైలు శిక్ష విధించారు.
300 ఎన్ కౌంటర్లు చేసిన మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మ అరెస్ట్!