- Advertisement -
గుర్తుందా శీతాకాలం” టైటిల్ ఖరారు?
యువ నటుడు నితిన్ హీరోగా నటిస్తున్న తర్వాతి సినిమా వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కృష్ణ చైతన్య ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ అందించాడు. నితిన్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.
అయితే ఈ సినిమా కోసం మంచి టైటిల్ను అనుకున్నారట. గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ని చిత్రబృందం అనుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ సరసన మేఘ ఆకాశ్ హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. లై సినిమా కొంచెం నిరాశ పరచడంతో నితిన్ ఈ సినిమాతోటి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.