- Advertisement -
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమాను ప్రారంభించారు.ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ హ్యాట్రిక్ సక్సెస్ కు రెడీ అవుతున్నాడు. ‘ఘాజీ’ లాంటి జాతీయ అవార్డు చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతరిక్ష నేపథ్యంలోఈ సినిమా తెరకెక్కనుంది.వరుణ్ తేజ్ను వ్యోమగామిగా చూపించనున్నాడట.
దర్శకుడు క్రిష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గురువారం ప్రారంభించారు.పూజాకార్యక్రమాల అనంతరం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిపై మెగా బ్రదర్ నాగబాబు క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైదరి హీరోయిన్స్గా చేస్తున్నారు.ఈ సినిమా కోసం లీడ్ యాక్టర్స్ కొద్ది రోజులుగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకుంటున్నారు.