Monday, April 29, 2024
- Advertisement -

ఒక్కటైన వరుణ్ – లావణ్య..హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీ!

- Advertisement -

మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు హీరో వరుణ్ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి. ఇటలీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు ఏడు అడుగులు, మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు దాదాపు 120 మంది అతిథులు ఈ శుభకార్యానికి హాజరయ్యారు. కొత్త జంట ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత వధూవరులు ఇద్దరూ తమ తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించగా పెళ్లి తర్వాత రిసెప్షన్ కార్యక్రమం కూడా జరిగింది. .

చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు,అల్లు అర్జున్ స్నేహా రెడ్డి దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, సుస్మితా కొణిదెల, నిహారిక అలాగే ఇండస్ట్రీ నుండి నితిన్ హాజరయ్యారు.

ఇటలీలో పెళ్లికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించగా హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఆ వేడుకకు ఇప్పటికే ఆహ్వానాలు అందగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వరుణ్ నటించిన ‘ఆపరేషన్ వేలంటైన్’ షూటింగ్ పూర్తి అయ్యింది. డిసెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -