ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటూ.. తనకంటూ మంచి గుర్తింపు క్రియేట్ చేసుకున్న వరుణ్ తేజ్ తొలిసారి ‘మిస్టర్’లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ చేశాడు. వరుస ఫ్లాపులతో బాధపడుతున్న శ్రీనువైట్ల.. ఈ సారి కసితో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీని ఖచ్చితంగా హిట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా బాగానే వచ్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. చూడబోతే.. శ్రీనువైట్ల ఈ సారి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇది రొటీన్ కమర్షియల్ సినిమా అయినప్పటికీ.. ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు జోడించి బాగా తెరకెక్కించారని బోర్డ్ సభ్యులు తెలిపారు. ఈ సినిమాని వీక్షించిన యూనిట్ సన్నిహితులు సైతం పాజిటివ్ టాక్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ సినిమా చాలా బాగా వచ్చిందని.. ప్రతిఒక్క ఎపిసోడ్ మెప్పిస్తుందని అంటున్నారు. లావణ్య, హెబ్బాలతో వరుణ్ నడిపే ప్రేమాయణం ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండాయని, కామెడీ పంచ్లు కూడా బాగానే పేలాయని.. ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని పేర్కొంటున్నారు.
క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని.. అక్కడ ఎమోషనల్ సీన్స్ మనసుని హత్తుకునేలా వుంటాయని చెబుతున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా అందంగా కనిపించడంతోపాటు యాక్టింగ్తో సూపర్ గా చేసాడని.. మాస్ సీన్లలో రెచ్చిపోయాడని టాక్ వినిపిస్తోంది. లావణ్య మరోసారి నటన పరంగా అదరగొట్టిందట. హెబ్బా కూడా అందంతోపాటు అభినయంతో కట్టిపారేసిందని చెప్పుకుంటున్నారు. మొత్తంగా.. శ్రీనువైట్ల ఎక్కడా ఫ్లాస్ లేకుండా చాలా చక్కగా, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని రూపొందించాడని చెబుతున్నారు. మరి ఈ సినిమా ఆడియెన్స్ని ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.