- Advertisement -
మహానటుడు ఎస్వీ రంగారావు శతజయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతు పాత సినిమాలలో నవరసాలు పోషించే తారలు ఉండేవారని కానీ ఇప్పుడు అలాంటి వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సినిమాల్లో శృంగారం తగ్గింది.. అంగారం పెరిగింది శృంగారం అనేదాన్ని అసభ్యకరంగా చూపించకూడదు. దానిపై జుకుప్స కలిగించకూడదు.ఇప్పటితారలు హీరోయిన్ ను తాకినా, పీకినా శృంగారం ఎక్కడా కనిపించడం లేదు. అంతా అంగారమే.. నటించడం రాకపోవడం వలనే ఇదంతా జరుగుతుందని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.