తేజ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా మార్చ్ 12వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మాదిరిగా అన్నదమ్ములుగా వెంకీ, రోహిత్ కనిపిస్తారనుకుంటే వాళ్లేమో బావమరుదులు అవుతున్నారు. ఈ వార్త టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్గా మారింది.
వెంకీ, రోహిత్ ఇద్దరు బావ బావరమరుదులుగా సినిమాలో పాత్రలు ఉన్నాయి. వెంకటేశ్ నారా రోహిత్ అక్కయ్య శ్రేయను చేసుకుంటాడు. అయితే ఈ సమయంలో వెంకీ చెల్లెలు ఈశా రెబ్బాను రోహిత్ పెళ్లి చేసుకోవాలి. ఈ విధంగా వీరిద్దరూ బావమరుదులు అవుతారు. మంచి కుటుంబ నేపథ్యంలో ఈ సినిమాను తేజ దర్శకత్వం చేస్తున్నాడు. యాక్షన్ ఎలెమెంట్స్ కూడా బాగా దట్టించి వెంకటేశ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాకు ‘ఆటా నాదే వేటా నాదే’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని చూస్తున్నారు.