Friday, April 19, 2024
- Advertisement -

కన్నీరు పెట్టుకున్న లేడీ కమెడియన్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎంతమంది ఉన్న లేడీ కమెడియన్స్ అంటే కొందరి పేర్లు మాత్రమే ఉన్నారు. గతంలో రమప్రభ,గిరిజ తర్వాత శ్రీలక్ష్మి లాంటి వాళ్లు తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించేవారు. తెలుగు, తమిళ ఇండస్గ్రీలో తనదైన కామెడీ మార్క్ చాటుకుంటుంది విద్యుల్లేఖ. చూడటానికి బొద్దుగా ఉండే విద్యుల్లేఖ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. స్యంలో ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. 

విద్యుల్లేఖ రామన్ తండ్రి మోహన్ రామన్ మంచి నటుడు. బాలచందర్ ఇష్టపడే నటుల్లో ఆయన ఒకరు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయిన ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. గత కొంత కాలంగా విద్యుల్లేఖ జిమ్, యోగ చేస్తూ సన్నబడింది. దాంతో ఆమెపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారట.

ఇకపై కమెడియన్ గా చేయవా? హీరోయిన్ గా మాత్రమే చేస్తావా ఏంటి? అంటూ కామెంట్లు చేశారట. తాజాగా విద్యుల్లేఖ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు సరసన ఒక హీరోయిన్ గా ‘పుడింగి నెంబర్.1’ చిత్రంలో నటిస్తుంది. నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కి విద్యుల్లేఖ కన్నీరు పెట్టుకుందట. అంతే కాదు తన లావు అయితే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని.. అందుకే సన్నబడేందకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. తనకు కామెడీ పాత్రలు అంటేనే ఇష్టమని అలాంటి పాత్రల్లోనే నటిస్తానని చెబుతుంది.

రాధిక, శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష

వర్మ మరో ‘దెయ్యం’ వస్తుంది..!

ముఖేష్ అంబానీ పిల్లల వాడే కార్ల గురించి తెలిస్తే ఔరా అంటారు!

అప్పుడు నో చెప్పి.. ఇప్పుడు ఓకే అన్న సాయి పల్లవి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -