తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్, ఆయన భార్య రాధికకు చెన్నై ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. చెక్ బౌండ్స్ కేసులో వారిపై నేరం నిరూపణ అయినందున కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు సినిమాలు నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఓ చిత్ర నిర్మాణం కోసం రేడియన్స్ అనే సంస్థ నుంచి అప్పుగా రెండు కోట్లు తీసుకుని ఆ మొత్తాన్ని చెల్లించే ప్రాసెస్లో చెక్ బౌన్స్ అయింది.
దీంతో రేడియన్స్ సంస్థ వీరిపై చెన్నైలోని సైదాపేట కోర్టులో చెక్బౌన్స్ కేసు దాఖలు చేసింది. 2019 జూన్లో దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వీరిద్దరితో పాటు లిస్టిన్ స్టీఫెన్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని తీర్పు వెలువరించింది.
అయితే ఈ కోర్టు తీర్పును సవాలు చేసు ఈ దంపతులు మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన చెన్నై స్పెషల్ కోర్టు బుధవారం ఇద్దరికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ సెలబ్రిటీ దంపతలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
తిరుపతి ప్రచారానికి సీఎం జగన్ సిద్దం.. ఏర్పాట్లలో నేతలు బిజీ బిజీ!