అందంతో కాకుండా డ్యాన్స్ , నటనతో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి. నటిగా దక్షిణాదిలో ఆమెకు ఉన్నడిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ప్రేమమ్’సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఈ మలయాళి ముద్దుగుమ్మ.. ‘ఫిదా’తో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ‘ఫిదా’లో సాయి పల్లవి మాట్లాడిన తెలంగాణ యాసకు కుర్రకారంతా ఫ్లాట్ అయ్యారు. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా… ఆమెకు భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది. పారితోషికాన్ని పట్టించుకోకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేసూకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మలయాళ భామ తెలంగాణ హీరో నితిన్తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రంగ్దే సినిమాతో ఓ మోస్తరు విజయం అందుకున్న నితిన్.. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ మూవీ అందాధున్కి రీమేక్ ఇది. ఈ సినిమా అనంతరం వక్కంతం వంశీతో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇప్పటికే ఈ విషయంపై సాయిపల్లవిని సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందే తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
కాగా, గతంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోందని వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో సాయి పల్లవి ఆ మూవీకి నో చెప్పిందట. మరి ఇప్పుడైనా నితిన్తో సాయి పల్లవి రొమాన్స్ చేస్తుందో లేదో చూడాలి.
పూరి జగన్నాథ్పై ఛార్మి సీరియస్.. కారణం ఇదేనా?
పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం.. నవ్వులు పూయిస్తున్న బండ్ల గణేశ్ స్పీచ్