విజయ్ దేవరకొండ, రష్మిక మందానా హీరో,హీరోయిన్లుగా నటించిన ‘గీతా గోవిందం’ సినిమా భారీ అంచనాల మధ్య నిన్న(శుక్రవారం) విడుదలైంది.మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదేవిధాంగా ఉన్నాయి.అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా కావడంతో యూత్ ఈ సినిమాకు క్యూ కట్టారు. సినిమా కథ,కథనం కూడా బాగుండటంతో సినిమా అందరికి నచ్చింది.ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించినట్లుగా చెబుతున్నారు.
ప్రీమియర్ షోల ద్వారా మంగళవారం నాటికి రూ.4 లక్షల డాలర్లను రాబట్టింది. బుధవారం నాటికి ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసేసింది. ఈ వీకెండ్ నాటికి సినిమా మిలియర్ డాలర్ క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు.విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’,’అర్జున్ రెడ్డి’ సినిమాలు కూడా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయి. ఇప్పుడు ‘గీత గోవిందం’ కూడా ఆ క్లబ్ లో జాయిన్ కానుంది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుని 6 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది.