గీతా గోవిందంతో డిసెంట్ హిట్ కొట్టాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత ‘నోటా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్.ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.ప్రస్తుత రాజకీయలను టార్గెట్ చేసుకుని తెరకెక్కితుంది ఈ సినిమా.అయితే ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ‘నోటా’ సినిమాకు తెలుగు డైలాగ్స్ తాను రాస్తే దర్శకుడు ఆనంద్ శంకర్ మాత్రం క్రెడిట్, రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశారంటూ రచయిత శశాంక్ వెన్నెలకంటి మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ విషయంపై చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు ఆనంద్ శంకర్.. నేను రాసిన డైలాగ్స్ ని అనువదించడం తప్ప శశాంక్ కొత్తగా చేసిందేమీ లేదని తమిళ మీడియా ముఖంగా చెబుతున్నారు. ఈ వివాదం ఓ కొలిక్కి వస్తే కాని సినిమా విడుదల కాని పరిస్థితి ఏర్పడింది.