- Advertisement -
ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ ఇంటివాడవుతున్నాడు. ఇష్క్, మనం, 24 చిత్రాలతో దర్శకునిగా తన ప్రతిభ చూపిన విక్రమ్ కుమార్ సినీ పరిశ్రమకే చెందిన శ్రీనిధిని పెళ్లాడబోతున్నారు. వీరిద్దరి వివాహ నిశ్చితార్ధం ఆదివారం నాడు చెన్నైలో జరిగింది. అన్నట్లు శ్రీనిధి కూడా సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయే కావడం విశేషం. చిత్రపరిశ్రమలో ఆమె సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
ఇటీవల సూపర్ హిట్ సాధించిన 24 చిత్రానికి సంగీతం అందించిన ఎ.ఆర్.రహమాన్ టీంలో శ్రీనిధి సౌండ్ ఇంజనీర్. ఈ రికార్డింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. వీరిద్దరు సమీప బంధువులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మర్చుకున్నారు. వీరి వివాహం సెప్టెంబర్ నెలలో జరుగుతుందని విక్రమ్ కుమార్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.