Saturday, May 4, 2024
- Advertisement -

మళ్లీ శర్వానంద్ గారు అనబోతున్న బన్నీ

- Advertisement -

యువ హీరో శర్వానంద్ రామ్ చరణ్ కి చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు మెగా హీరోలు శర్వానంద్ సినిమా వేడుకలలో కనిపించారు. తాజాగా శర్వానంద్ హీరోగా నటించిన ‘పడి పడి లేచే మనసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వయంగా అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అక్కడ వేదికపై మాట్లాడు శర్వా తనకు మంచి స్నేహితుడు అయినప్పటికీ శర్వానంద్ ‘గారు’ అనే పిలుస్తానని, అందరూ అదే ఫాలో అవ్వాలని చెప్పుకొచ్చాడు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ కాకినాడలో షూటింగ్లో పాల్గొంటున్నాడు. మరో వైపు ఈ సినిమాను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ వారు శర్వానంద్ ‘రణరంగం’ సినిమా కూడా నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిర్మాతలు ‘రణరంగం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అల్లు అర్జున్ ని ముఖ్య అతిథిగా పిలవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక ఆగస్టు 4 వ తేదీన కాకినాడ లోనే జరగనుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు బన్నీ మరియు త్రివిక్రమ్ ని ఈ వేడుకకి రమ్మని ఆహ్వానించబోతున్నారట. మరి ఈసారి అల్లు అర్జున్ ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నాడు అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సుధీర్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ మరియు కల్యాణీ ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటించిన ‘రణరంగం’ ఆగస్టు 15న విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -