శ్రీదేవి మరణించి చాలా కాలమే అయిన ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఆమె బహుబలి సినిమాలో ఎందుకు నటించలేదనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. శివగామి పాత్ర కోసం రాజమౌళి తొలుత శ్రీదేవినే సంప్రదించినట్లు దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత.. ఆ పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపికచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నటించడానికి శ్రీదేవి కూడా చాలా ఇష్టంతో ఉందని కాని తన భర్త బోనీ కపూర్కు ఈ సినిమాలో నటించడం ఇష్టం లేకే శ్రీదేవి ఈ సినిమాను వదిలేసిందని చెప్పుకొచ్చాడు వివాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.
శ్రీదేవి అధిక మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసి ఈ సినిమా నుండి తప్పుకుందని వర్మ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని రాజమౌళి కూడా ధృవికరించాడు. శ్రీదేవి అధిక రెమ్యూనిరేషన్ డిమాండ్ చేయడంతోనే రమ్యకృష్ణని తీసుకున్నాం అని రాజమౌళి ఒక ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. బోనికపూర్ నిర్ణయాల వల్ల శ్రీదేవి కెరీర్ పరంగా చాలా నష్టపోవాల్సింది వచ్చిందని వర్మ ఆరోపించారు.శ్రీదేవి శివగామి పాత్ర చేసి ఉంటే అంత హుందాతనం వచ్చేది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.