Saturday, May 18, 2024
- Advertisement -

ప్రభాస్ మహేష్ ను కొడతాడా ఏంటి..?

- Advertisement -

బాహుబలితో ప్రభాస్ కొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసం రకరకాల వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే మహీంద్ర గ్రూప్…. తన వెహికల్ టియువి 300 ప్రమోషన్ కు ప్రభాస్ ను వాడుకుని ఆయనగారి ఆరడుగుల కటౌట్ ను తన షోరూమ్ల దగ్గర పెట్టింది. మరి ఇంకెంత మంది ప్రభాస్ వాడుకుని అతని 6 అడుగుల కటౌట్ ను ఎక్కడెక్కడ పెట్టానులకుంటున్నారో తెలియదుగాని..ముంబాయి కేంద్రగా పని చేసే ఓ పి.ఆర్.ఓ. సంస్థ మాత్రం…. ప్రభాస్ తో అగ్రిమెంట్లు కాస్త ఎక్కువగానే కుదిర్చేసుకుంటుంది.

 సల్మాన్ ,షారుక్ ,అమీర్ ఖాన్ ,దీపికా పదుకునేలతో గతంలో పని చేసిన ఈ సంస్థ… ప్రభాస్ కు ఇంకో మూడు నాలుగు భారీ  ఆఫర్లను తెచ్చిపెట్టేలా ఉంది.అవి కూడా ఓకే అయితే యాడ్స్ రూపంలో ప్రభాస్ ను ఏడాదికి 50 కోట్లకు పైగానే కుమ్మేసుకోవచ్చు.

దీంతో టాలీవుడ్ నుంచి యాడ్స్ రంగంలో గట్టిగానే రాబడుతోన్న మహేష్ బాబుకు ప్రభాస్ ఝలక్ ఇచ్చినట్లవుతుంది. ఏమో రేపన్న రోజు మహేష్ చేస్తోన్న శీతల పానీయం యాడ్…. వచ్చే వేసవికి ప్రభాస్ కు చిక్కినా చిక్కొచ్చంటున్నారు. ఎందుకంటే మహేష్ చేస్తోన్న శీతలపానీయం యాడ్ ఈ ఏడాదితో ముగియనుందని తెలుస్తోంది. వచ్చే వేసవికి  బాహుబలి ఫీవర్  ఊపందుకుంటుంది కాబట్టి…. ఆ కార్పొరేట్ సంస్థ బాహుబలిపై ఇప్పటినుంచే దృష్టి పెట్టిందట.

ఒక వేల డీల్ ఓకే అయితే మాత్రం ప్రభాస్ యాడ్ ఇన్ కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహేష్ ను తప్పకుండా క్రాస్ చేస్తాడు. అన్నట్లు ఇంకో విషయం ప్రభాస్ చేసిన టియువి 300 యాడ్ కు సంబందించిన 6 అడుగుల ప్రభాస్ పోస్టర్లను మహేంద్ర గ్రూప్ తమ షోరూమ్ ల దగ్గర పెట్టి ఇప్పటినుంచే హడావిడి షురూ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -