ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రజల మనసును గెలుచుకొని అధికారంలోకి రావాలిగాని ….ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు రచయిత, డైరెక్టర్ కోన వెంట్ ఘాటుగా స్పందించారు. పవన్ తప్పటడుగులు వేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు.
జనసేనాని మాటలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్న ఆయన.. ఈ ఐదేళ్లలో తెలంగాణలో ఎక్కడా ఆంధ్రా ప్రాంత ప్రజలపై దాడులు జరగలేదన్నారు. పవన్ ఎవర్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. తెలంగాణా రాష్ట్రసీఎంను తిడుతూ ఉత్తరాది రాష్ట్ర నేత అయిన మాయావతితో చర్చలు జరిపి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కోన వెంకట్ ప్రశ్నించారు. మాయావతి మీకు మదర్ థెరిసాలా కనిపించిందా? అని ప్రశ్నించారు.
పవన్ జగన్పై చేస్తున్న వ్యాఖ్యలను అర్ధరహిత మన్నారు. జగన్పై పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా.. తాను జనసేనా జెండా పట్టుకొని తిరుగుతానని కోన వెంకట్ సవాల్ చేశారు. మాయావతి లాంటి వారితో పొత్తు పెట్టుకొని ఒక్క కేసు కూడా ఫ్రూవ్ కాని జగన్ లక్ష్యంగా విమర్శలు ఎందుకు చేస్తున్నారని ఆయన పవన్ను ప్రశ్నించారు.