ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి రాజీకీయ జీవితంలోని ప్రముఖ ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా యాత్ర. ఈ సినిమాలో వైఎస్ఆర్గా మళయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా , ఈ నెల 8న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సంచలనం రేపుతోంది. అమెరికాలో ఈ చిత్రం మొదటి షో టికెట్ ను వేలం వేశారు.
మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి టికెట్ ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. మన దేశ కరెన్సీలో దీని ధర అక్షరాలా రూ. 4.37 లక్షలు. అమెరికాలోని సియాటెల్ లో ఈ వేలంపాటను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వైఎస్ఆర్ తండ్రిగా ప్రముఖ నటుడు జగపతి బాబు, ఓ మహిళ ఎమ్మెల్యేగా యాంకర్ అనసూయ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాళ భాషలో కూడా విడుదల చేయనున్నారు.
- Advertisement -
రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘యాత్ర’ తొలి టికెట్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -