ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ సినిమా సిద్దమవుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ప్రస్తావనగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టీ నటిస్తున్న విషయమూ తెలిసిందే. ఈ సినిమాను మహిరాఘవ డైరెక్ట్ చేస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ బయోపిక్ ను మొదట డిసెంబర్ లో విడుదల చేయాలని భావించారు. కాని చిత్రీకరణ ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా వేశారు. ఈ చిత్రం విడుదళపై వస్తున్న వార్తలను చిత్రం యూనిట్ ఖండించింది. వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ మూవీని ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దమయినట్లుగా చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
యాత్ర సినిమా విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో డైరెక్టర్ రాఘవ ఈ సినిమా ట్రైలర్ను జగన్కు చూపించారు. ప్రస్తుతం శ్రీకాకులం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ ట్రైలర్ మొత్తం చూసి అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.
తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా అదే రోజున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి ఈ చిత్రంలో వైఎస్ పాత్రను పోషించగా కీలక పాత్రల్లో జగపతిబాబు సుహాసిని నటించారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు.