- Advertisement -
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైఎస్సార్ పాత్రలో మళయాళ నటుడు మమ్ముట్టీ నటిస్తున్నాడు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
ఈ సినిమా షూటింగ్ను సింగిల్ షెడ్యూల్ పూర్తిచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.ఇక ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా యాత్ర టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.