Friday, April 26, 2024
- Advertisement -

యాత్ర 2 కథ ఇదే….

- Advertisement -

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారం గా తెరకెక్కించబడిన చిత్రం యాత్ర. ఈ సినిమా లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర తాలూకూ ఘట్టాలని చూపించారు దర్శక నిర్మాతలు. ఇక పోతే జగన్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత యాత్ర 2 సినిమా మొదలవుతుంది అని వార్తలు వచ్చాయి. ఈ సినిమా లో ఏం కథ చెప్తారు అని అందరూ భావిస్తున్న తరుణం లో ఈ సినిమా కథ పై మాకు ఒక క్లారిటీ వచ్చింది.

“వైస్సార్ కథ వైఎస్ రాజా రెడ్డి ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని గురించి చేప్పకుండా ఉంటే అసంపూర్ణమే అవుతుంది. యాత్ర 2 ద్వారా నే ఈ కథ కి ఒక పరిపూర్ణత వస్తుంది. మేము యాత్ర ని వైఎస్ జగన్ మీద ఆపడానికి కూడా కారణం అదే.ఎక్కడయితే మేము ఈ కథ ని ఆపేశామో అక్కడ నుంచి మళ్ళి మొదలు పెట్టొచ్చు అనే ఉదేశ్యం తో. వైఎస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర తన తండ్రి సమాధి దగ్గర మొదలు కాగా, ఇప్పుడు జగన్ ది కూడా అలాగే మొదలైంది. అదే యాత్ర 2 లో చూపించబోతున్నాము.” అని మహి వి రాఘవ్ తెలిపాడు. ఇక ఈ సినిమా కూడా యాత్ర నిర్మాతలే తెరకెక్కించే అవకాశం ఉంది. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడి ఆయె అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -