Friday, March 29, 2024
- Advertisement -

హృద‌యాన్ని హ‌త్తుకునేలా ‘యాత్ర’ సాంగ్‌

- Advertisement -

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాజకీయ జీవితంలో పాదయాత్ర ఘట్టాన్నియాత్ర సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ఆర్‌గా మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌,ట్రైల‌ర్‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

పల్లెల్లో కల ఉంది.. పంటల్లో కలిముంది అంటూ సాగే ఈ పాటలో రైతుల కష్టాలను, వారు పడే బాధలను వివరించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. పాట‌ను వింటుంటే గుండెను కదిలించేలా ఉంది. మహి వి రాఘవ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.జ‌గ‌ప‌తి బాబు,అన‌సూయ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -