ఈ మద్య ఆడవారు పట్టపగలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. మహాత్మాగాంధీ ఆడవారు అర్థరాత్రి ఒంటరిగా నడిచినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. కానీ ఇప్పడు ఆడవారు పట్టపగలు ఒంటరిగా నడవాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా కేరళాలోని మలప్పురం జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ళ అమ్మాయిపి 44 మంది కామంధులు రెచ్చిపోయారు. ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు ఈ యువతిని బెదిరించి అత్యాచారం చేశారు. జిల్లాలోని పండిక్కాడ్ ప్రాంతంలో జరిగిందీ దారుణం.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీపీ శామ్స్ కథనం ప్రకారం.. బాధిత బాలిక 2016లో ఒకసారి, 2017లో మరోమారు లైంగిక వేధింపులకు గురైంది. ఇక మూడో సారి కూడా బెదిరించి బాలికపై కామాంధులు రెచ్చిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మూడుసార్లు లైంగిక వేధింపులకు గురైనట్టు మేజిస్ట్రేట్ ఎదుట బాలిక 164 స్టేట్మెంట్లు ఇచ్చినట్టు డీఎస్పీ తెలిపారు.
2016లో ఒకసారి, 2017 ఒకసారి బాలిక లైంగిక వేధింపులకు గురైందని, అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లని షామ్స్ పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 44 మంది అనుమానితులు ఉన్నారని, వీరిలో నమోదైన కేసుల్లో ఏడు కేసులు తీవ్రమైనవని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మిగతా నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.