Friday, May 3, 2024
- Advertisement -

ప్ర‌త్యేక‌హోదాకోసం ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంట‌గూ సెల్‌ట‌వ‌ర్ ఎక్కిన ఉద్యోగి…

- Advertisement -

ప్రత్యేక హోదా కోసం ఏపీలో నిరసనలు తీవ్రతరమవుతున్నాయి. ఇటీవలే ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా అనంత‌పురం ధ‌ర్మ‌వ‌రంలో నవ్యాంధ్ర డెవలప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షుడు పెనుబోలు విజయ్‌ భాస్కర్‌ శనివారం సెల్‌ టవర్‌ ఎక్కారు. ధర్మవరంలో శనివారం సెల్‌ టవర్‌ ఎక్కిన విజయ్‌ భాస్కర్‌ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

హోదా కోసం చనిపోతానంటూ లేఖ కూడా రాశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -