Tuesday, May 7, 2024
- Advertisement -

అనుమానాస్ప‌ద స్థితిలో మృతి. చెందిన బ్యూటిషియ‌న్‌..

- Advertisement -

హైదరాబాద్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఓ యువతి వికారాబాద్‌లో శవమై తేలింది. అనుమానాస్పద స్థితిలో రైలు నుంచి పడి మృతి చెందింది. లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి తాండూరులో అమ్మమ్మ వాళ్లింటికి జాతరకని బీజాపూర్ రైలులో బయలుదేరింది. ధారూర్ మండలం మైలారం వద్ద ఆదివారం (ఏప్రిల్ 15) రాత్రి రైలు నుంచి కిందపడిపోయింది. సోమవారం ఉదయం రైలు పట్టాల పక్కన యువతి పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. కొన ఊపిరితో ఉన్న జ్యోతిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది.

జ్యోతిపై ఎవరైనా దుండగులు బలత్కారానికి ప్రయత్నించి రైలు నుంచి తోసేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె ఫోన్ మైలారం సమీపంలో దొరికినట్లు వారు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిది హత్యా? ఆత్మహత్యా? ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడిపోయిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి కాల్ డేటా పరిశీలించిన పోలీసులు ఆమె స్నేహితుడు సందీప్ కోసం ఆరా తీస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -