ప్రపంచంలో ఓ వైపు కరోనా కలకలం రేపుతుంటే మరోవైపు బాంబు దాడులతో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ సంబురాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అఫ్గానిస్థాన్ లో ఘోరం జరిగింది. ఉత్తర కాబుల్లోని మసీదుపై శుక్రవారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని అఫ్గాన్ పోలీసులు తెలుపగా.. మరో 15 మందికి గాయాలయ్యాయని చెప్పారు. రంజాన్ సందర్భంగా మసీదులో ప్రార్ధనలు మొదలుకాగానే బాంబు దాడి జరిగింది.
ఈ పేలుడులో ముస్లిం మతగురువు మృతి చెందారని ఇక్కడి పోలీసు ప్రతినిధి ఫెర్డాస్ ఫరామార్జ్ తెలిపారు. ఈ బాంబు పేలుడు మతగురువును లక్ష్యంగా చేసుకొని జరిగి ఉండవొచ్చని పోలీసులు అంటున్నారు. సాధారణంగా ఇలాంటి దాడులు జరిపిన వెంటనే ఉగ్రవాదులు ఇది తమ చర్యగా ప్రకటిస్తుంటారు. కానీ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే ఈ దాడి చేసినట్లు ప్రకటించలేదని ఇక్కడి అధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అఫ్గాన్ ప్రభుత్వం తాలిబన్లతో ఒప్పందం చేసుకుంది. కానీ, బాంబు పేలుడుతో బీభత్సం జరిగింది. ఈ దాడికి తాలిబన్లే కారణమని ఇంకా నిర్ధారణ కాకపోగా వారిపనిగానే స్థానిక ప్రజలు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది.
రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు!