ఇటీవల దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో రోడ్డు పైకి ఏ ఒక్క వాహనం అనుమతించలేదు. దాంతో రోడ్డు ప్రమదాల సంఖ్య తగ్గింది. ఇక లాకౌ డౌన్ ఉపసంహరించిన తర్వాత వరుస రోడ్డు ప్రమాదాలతో రోడ్లన్నీ రక్తసిక్తం అవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడం పదుల సంఖ్యల మరణాలు సంబవించడం జరుగుతుంది. తాజాగా మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుని 32 మంది మృతి చెందారు.
సిధి జిల్లాలోని పట్నా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడంతో పలువురు గల్లంతయ్యారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. బస్సు కాల్వలో పడిన అనంతరం ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదవార్త తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున అక్కడకు తరలివచ్చారు. సిధి జిల్లా కేంద్రం నుంచి 80 కి.మీల దూరంలో ఈ రోజు ఉదయం 8.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో అధికంగా మహిళలు ఉన్నట్టు సమాచారం.