Sunday, April 28, 2024
- Advertisement -

టివీ5 రవీంద్రనాధ్ పై పోలీస్ కేసు.

- Advertisement -

టివీ5 రవీంద్రనాథ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. కోట్లాది రూపాయల భూమిని తక్కువ ధరకు అమ్మి  టివీ 5 రవీంద్రనాథ్ సొమ్ము చేసుకున్నారని సురేష్ బాబు అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అసలు సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా గుట్టుచప్పుడు కాకుండా మూడు వందల యాభై గజాల స్థలాన్ని పార్వతి దేవి  అనే మహిళకి  కి  అమ్మేశారు. కోట్ల రూపాయలను జేబులో వేసుకున్నారు. 

అయితే కోట్లాది రూపాయల స్థలాన్ని గజం 45 వేలకు పార్వతి దేవి కి విక్రయించారని దీని వల్ల సొసైటీ కి 5 కోట్ల మేర నష్టం జరిగిందని సురేష్ బాబు అనే వ్యక్తి  జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్ర నాయుడు  తో పాటు కోశాధికారి నాగరాజు పై  కేసు నమోదు చేశారు.  దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అయితే ఇక్కడే ఇంకొక వివాదం తెరపైకి  వచ్చింది తమ స్థలం కబ్జాకు గురైదంటు  జిహెచ్ఎంసి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు.సదరు స్థలం జిహెచ్ఎంసి కి సంబంధించిందని అందులో నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మొత్తానికి సుపరిపాలన అందిస్తామని చెప్పిన రవీంద్రనాధ్ (టీవి5 )అధికారం లోకి వచ్చి 3 నెలలైనా కాకముందే ఆయనకు అలవాటైన  రీతిలో అక్రమాలకు తెరలేపారని సొసైటీ సభ్యులు అనుకుంటున్నారు.

Also Read

ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు సెలవులు.. ఎక్కడంటే..?

డాక్టర్ భార్య పై డాక్టర్ భర్త గృహ హింస..

రైతన్న కడుపుకొట్టిన ఎలుకలు..! నోట్ల కట్టలు కొరికేశాయి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -