Friday, April 26, 2024
- Advertisement -

తమిళనాడులో ఘోరం.. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..

- Advertisement -

ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో ఎక్కడో అక్కడ మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పురావడం లేదు. తాజాగా తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికపై మాయమాటలు చెబుతూ.. కొంత మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చారు.

అత్యాచారం చేసిన కేసులో బీఎస్ఎన్ లో ఇంజనీరుతో సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలినవారి కోసం గాలింపు చేపట్టారు. బాలిక తన తల్లితండ్రులు, సోదరితో కలిసి కుమార పాళ్యంలో నివసిస్తోంది. తండ్రి కొంత కాలంగా అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఈ నేపథ్యంలో తల్లి కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది.

ఇదిలా ఉంటే  అక్కాచెల్లెళ్ల మద్య గొడవలు రావడంతో చెల్లెలు అక్క గురించి తల్లితో చెప్పడంతో.. వెంటనే తల్లితండ్రులు ఈవిషయాన్ని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారికి తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ క్రమంలో బాలిక భయంకరమైన నిజాలు వెల్లడించింది.

మాయమాటలు చెప్పి, డబ్బు ఆశ చూపించి మొదల తన బావ లైంగిక దాడి చేయగా.. తాను పనిచేస్తున్న ఇంటి యజమానులు తనపై  గత రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో 12 మందిని మంళవారం సాయత్రానికి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరోక నిందితుడికోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

నటుడు బండ్ల గణేష్ కి మళ్లీ కరోనా..

సీఎం కేసిఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న సాగర్..!

అనుకున్న విధంగా తెలంగాణా లో కేసులు ఈరోజు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -