Saturday, April 27, 2024
- Advertisement -

నటుడు బండ్ల గణేష్ కి మళ్లీ కరోనా..

- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత,హాస్య నటుడు బండ్ల గణేశ్ మరోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. ఇటీవల ఆయన కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే.. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. అయితే, ఆయ‌నకు రెండోసారి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో జరిగిన ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గ‌ణేశ్ పాల్గొన్నారు.

మరుసటి రోజు ఆయన జ్వరం,ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో బండ్ల గణేశ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, ఇటీవ‌ల సినీ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి కూడా క‌రోనా సోకింది. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ముంద‌స్తు జాగ్రత్త‌గా ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. వకీల్ సాబ్ ఈవెంట్‌లో చాలా హుషారుగా కనిపించిన గణేశ్… ఆ తర్వాత కొద్దిరోజులకే కరోనా బారిన పడటం హాట్ టాపిక్‌గా మారింది.

అనుకున్న విధంగా తెలంగాణా లో కేసులు ఈరోజు..!

రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్.. కారణం అదేనా?

దారుణం.. అతీ శక్తుల కోసం కన్నబిడ్డలనే కడతేర్చేయత్నం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -