హైదరాబాద్ శివార్లలోని అబ్ధుల్లాపూర్మెట్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇన్ స్పెక్టర్, అతడి భార్య మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సుల్తాన్ పూన్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నాడు. దంపతులు సూర్యాపేట నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో కారును డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ భార్య డ్రైవ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్(39), జాన్సీ(34) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కుమారుడు కుశ్ లవ్ చిన్న పాటి గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
మీర్ పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భూమిపై వచ్చే రాకెట్ పై క్లారిటీ ఇచ్చిన చైనా