Saturday, April 20, 2024
- Advertisement -

అబ్దుల్లాపూర్ మెట్ లో రోడ్డు ప్రమాదం.. డిఐ దంపతులు మృతి..!

- Advertisement -

హైదరాబాద్ శివార్లలోని అబ్ధుల్లాపూర్‌మెట్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇన్ స్పెక్టర్, అతడి భార్య మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డిటెక్టివ్ ఇన్‎స్పెక్టర్ లక్ష్మణ్ సుల్తాన్ పూన్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నాడు. దంపతులు సూర్యాపేట నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో కారును డిటెక్టివ్ ఇన్‎స్పెక్టర్ లక్ష్మణ్ భార్య డ్రైవ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్(39), జాన్సీ(34) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కుమారుడు కుశ్ లవ్ చిన్న పాటి గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

మీర్ పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భూమిపై వచ్చే రాకెట్ పై క్లారిటీ ఇచ్చిన చైనా

మరోసారి మంచి మనసు చాటుకున్న సల్మాన్ ఖాన్

నేటి పంచాంగం, శనివారం (8-05-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -