Tuesday, April 16, 2024
- Advertisement -

దారుణం.. బాలిక‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన అఘంతకులు!

- Advertisement -

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గత కొంత కాలంగా మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఎక్కడో అక్కడ మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బనగానపల్లె యాగంటిపల్లెలో బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకొండకు చెందిన కొందరు జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనుల కోసం వచ్చారు.

ఉదయం ఆ బాలిక తండ్రి పనికోసం వెళ్లాడు. ఆ పక్కనే తాత్కాలిక షెడ్ల దగ్గర కుమార్తె ఉంచి వెళ్లాడు. అయితే సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి చూడగా షెడ్‌ పక్కన కుమార్తె మంటల్లో కాలిపోయి ఉండటాన్ని గమనించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

వెంటనే ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించి, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికపై ఎవరైనా లైంగికదాడికి పాల్పడిన అనంతరం డీజల్‌ పోసి నిప్పటించి హత్య చేశారా లేదా ఆత్మహత్య చేసుకుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఏపీ విద్యార్థుల‌కు మైక్రోసాఫ్ట్ మ‌ణిహారం

రేపటి నుంచి ఏపీలో నైట్‌ కర్ఫ్యూ

18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -