దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. అప్కమింగ్ మోడల్ మాన్సీ దీక్షిత్ అంధేరీలో దారుణ హత్యకు గురైంది.ఆమెను హత్య చేసి.. అనంతరం ఆమె శవాన్ని సూట్ కేసులో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. వివరాల్లోకి వెల్తే..రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరానికి చెందిన మానసి దీక్షిత్ (20) మోడలింగ్ చేస్తున్నారు. మానసి దీక్షిత్ ఆరునెలలక్రితం ముంబై నగరానికి వచ్చి అంధేరిలోని మిల్లత్ నగర్ లో నివాసం ఉంటోంది.
కొంత కాలం క్రితం అంధేరికి చెందిన సయ్యద్ (19) డిగ్రీ విద్యార్థి తో మానసికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి తిరగడం మొదలుపెట్టారు. అయితే.. ఇటీవల వీరిద్దిరికీ ఏదో విషయంలో గొడవ జరగడంతో సయ్యద్ స్టూల్తో బలంగా మానసిని కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
అనంతరం ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగులో పెట్టి దాన్ని మలాద్ ప్రాంతంలోని మైండ్ స్పేస్ వద్ద పొదల్లో పడేశాడు. స్థానికులు బ్యాగు నుంచి వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసుకు సంబంధించి 19 ఏళ్ల సయ్యద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ అంధేరి ప్రాంతంలో ఉంటున్న సయ్యద్… హైదరాబాద్కు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు.
హత్యచేసిన వెంటనే మానసి మృతదేహాన్ని సూట్కేసులో కుక్కి… మలాద్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చెత్తలో సూట్ కేసును పడేశాడు. అక్కడ్నుంచి ఆటోలో వెళ్లిపోయాడు. దీంతో సయ్యద్ ప్రవర్తన విచిత్రంగా ఉండటం చూసి అనుమానించిన క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ చెప్పిన విషయాల్ని.. సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. వెంటనే సయ్యద్ను అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మలద్ ప్రాంతం నుంచి మాన్సీ శవాన్ని స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు.