Sunday, April 28, 2024
- Advertisement -

భారత్ లో తిరగాలంటే భయమేస్తోంది.. ఇండియా పరువు పాయే !

- Advertisement -

ఆడవారికి అత్యంత గౌరవం ఇచ్చే దేశంగా ఇండియాకు ప్రపంచ దేశాలలో మంచి పేరుంది. అందుకే ఇండియన్ కల్చర్ కు ప్రపంచ దేశాల ప్రజలు అమితంగా ఆకర్షితులు అవుతుంటారు. అయితే కొందరి దుర్మార్గుల వికృత చేష్టల వల్ల భారత్ పరువు మంటకలిసిపోతుంది. ” ఛీ.. ఛీ.. ఇండియన్స్ ఇలా ఉంటారా.. ” అంటూ విదేశీయులు మన దేశాన్ని అసహ్యించుకునే పరిస్థితులు నేటి రోజుల్లో కల్పిస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఓ కొరియన్ అమ్మాయిపై ముంబైలో జరిగిన సంఘటన చూస్తే మన ఇండియన్స్ పై సగటు ఇండియన్స్ కు కూడా అసహ్యం వేస్తుంది.

కొరియా దేశానికి చెందిన మయోచి అని ఓ మహిళా యూట్యూబర్.. మనదేశ కల్చర్ ను ఎక్స్ ఫ్లోర్ చేయడానికి ఇండియాకు రాగా.. అందులో భాగంగా ముంబైలో వీడియో చేస్తున్న నేపథ్యంలో ఓ ఇద్దరు యువకులు ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బైక్ ఎక్కాలంటూ ఆమె చేయి పట్టుకొని బలవంతం చేశారు. అంతే కాకుండా ఆమె వీడియో షూట్ చేస్తుందని తెలిసి కూడా ఓ యువకుడు ఆమెకు ముద్దు పెట్టె ప్రయత్నం చేశాడు. దాంతో ఊహించని పరాభవం ఎదుర్కొన్న ఆమె అక్కడి నుంచి చకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేసింది.

అయినప్పటికి ఆ దుర్మార్గులు ఆమె వెంట పడుతూ.. డ్రాప్ చేస్తామని బైక్ ఎక్కలని వేదించగా ఆమె తన ఇల్లు పక్కనే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో భారత్ లో ఎదురైన ఈ ఊహించని పభావాన్ని ఆ కొరియన్ మహిళ ట్విత్తర్ లో వీడియో పోస్ట్ చేసింది. ” ఈ ఘటనతో ఇండియా వీధుల్లో లైవ్ స్ట్రీమ్ చేయాలంటే భయంగా ఉందంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. దీంతో వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో ఆ కొరియన్ అమ్మాయీకి దైర్యం చెబుతూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఆ ఇద్దరు దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇద్దరు యువకులను పెట్టుకొని కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తాని కొందరి దుర్మార్గులు చేసే వికృత చేష్టల వలన భారత్ విదేశీయుల ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -